వీణవంక, అక్టోబర్ 16: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గడపగడపకూ వివరించి ఓట్లు అభ్యర్థించాలని టీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. మండలంలోని కనపర్తి, రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, శ్రీరాములపేట, హిమ్మత్నగర్, కొండపాక, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే సండ్ర టీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు. పేదల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని దేశం యావత్తు గమనిస్తున్నదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబం ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతుందని తెలిపారు. బీజేపీ ఓట్ల సమయంలోనే కనబడుతుందని, దళిత వ్యతిరేక పార్టీకి ప్రజలు ఓటుతోనే తగిన గుణపాఠం చెప్పాలని, గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేయాలని కోరారు. ఆదివారం మామిడాలపల్లి, ఎలుబాక, గంగారం, కొండపాక. శ్రీరాములపేట గ్రా మాల్లో జరిగే ఎన్నిక ప్రచారంలో, సాయంత్రం మండల కేంద్రంలో జరిగే ఎన్నికల సభకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు హాజరు కానున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విండో మాజీ చైర్మన్ మాడ సాధవరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పర్లపెల్లి రమేశ్, ఆవాల అరుంధతి, రాధ, పంజాల అనూష, ఎంపీటీసీలు ఒడ్డెపెల్లి లక్ష్మి-భూమయ్య, సంగ స్వరూప-సమ్మయ్య, నల్ల మమత-తిరుపతిరెడ్డి, రాధారపు రాంచందర్, మాజీ సర్పంచులు శ్యాం సుందర్రెడ్డి, సత్యనారాయణ, నాయకులు పోతుల సురే శ్, శశికుమార్, తిరుపతి, మ్యాక వీరయ్య, సమ్మయ్య, గె ల్లు రమేష్, గిరిబాబు, రాజ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, చింత ల రాజయ్య, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.