చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
సీతంపేటలో తాపీ మేస్త్రీల సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ
ఇల్లందకుంట, సెస్టెంబర్ 16: అన్ని కులాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మేల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని సీతంపేట గ్రామంలో తాపీ మేస్త్రీల సంఘ భవన నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు కాగా గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో కుల సంఘాలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో అన్ని కుల సంఘాల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నామని చెప్పారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇప్పటికే పలు కుల సంఘాల భవన నిర్మాణాల కోసం నిధులను కూడా మంజూరు చేశామని గుర్తు చేశారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ తన స్వార్థం కోసమే రాజీనామా చేశాడే గాని, ప్రజల సంక్షేమమే కోసం కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయకుండా, బీజేపీ నుంచి ఎమ్మేల్యేగా గెలిచి ఏమి అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడి ప్రజలు గెలుస్తారని, హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కరీంగర్ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సర్పంచ్ వెంకటస్వామి, ఎంపీటీసీ ఓదెలు, రైతు బంధు గ్రామ కో ఆర్డినేటర్ రహీం, ఉప సర్పంచ్ సురేశ్ తదితరులున్నారు.