రాజన్న సిరిసిల్ల, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సర్కారు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నది. ఆడబిడ్డకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి. డెయిరీ, పుడ్ ప్రాసెసింగ్, పచ్చళ్లు, దుస్తుల తయారీలాంటి అనేక రకాల పరిశ్రమల ఏర్పాటుకు శ్రీనిధి బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే రుణాలందిస్తున్నది. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల కోసం కుటీర పరిశ్రమలను ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. అందుకు డ్వాక్రా సంఘాల మహిళలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ అనేక రకాల పథకాలు ఇక్కడ అమలయ్యేలా చూస్తున్నారు. దీంతో ప్రతి మహిళ సంఘంలో చేరి రుణసహాయంతో ఏదో ఒక పరిశ్రమ పెట్టుకుని తన కాళ్లమీద తాను నిలబడే స్థాయికి ఎదుగుతున్నారు. అందులో భాగంగా పాడిగేదెలను అందించి పల్లెకో పాలడెయిరీ ఏర్పాటు చేశారు. పాలవ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందుతున్నది. తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూరులో నందిని హోంనీడ్స్ పికిల్స్ పేరిట మంత్రి కల్యాణీ శ్రీవర్ధన్ మహిళా సంఘ సభ్యురాలు పచ్చళ్ల తయారీ వ్యాపారం చేస్తున్నది. వెజ్, నాన్వెజ్ తొక్కులను తయారు చేస్తూ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నది. ఇలా జిల్లాలో అనేక మంది మహిళలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకుం టూ ఆర్థిక పురోగతివైపు అడుగులేస్తున్నారు.
8365 సంఘాలు.. 16.96 కోట్లు
సమైక్య పాలనలో కొన్ని సంఘాలు మాత్ర మే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన త ర్వాత అందిస్తున్న ప్రోత్సాహం వల్ల సంఘాల సంఖ్య బాగా పెరిగింది. ప్రతి పల్లె, పట్టణంలోని ప్రతి వార్డుకో సంఘం ఏర్పాటు చేసుకున్న మహిళలు బ్యాంకు రుణాలు తీసుకున్న లబ్ధిదారులే. ప్రభుత్వం అందిస్తున్న పావలా వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన జీవనం గడిస్తున్నారు. ఒకప్పుడు అప్పు కో సం మైక్రో, షేర్ముల్లా లాంటి ఫైనాన్స్లను ఆశ్రయించి వాటి ఉచ్చులో చిక్కుకుని ఆస్తుల ను కుదవపెట్టుకునే పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో చాలా మంది మహిళలు మరొకరికి అప్పు ఇచ్చే స్థాయికి వచ్చారు. కాగా, అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ వడ్డీలేని రుణాలు 750కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటించడమే కా కుండా ఆడబిడ్డల ఖాతాల్లో జమయ్యేటట్లు చొ రవ తీసుకున్నారు. 8365 సంఘాలలోని 80 వేల మందికి 16కోట్ల 96లక్షల 549 ఖాతాలో జమ చేశారు. అమాత్యుడు ఇచ్చిన మాట నెరవేర్చినందుకు ఆడబిడ్డలంతా సంతో షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రొసీడింగ్లు ఇచ్చాం
వడ్డీలేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసిం ది. ఇందుకు సంబంధించి జిల్లాలోని 8365 సంఘాలకు 2018, 19, 19, 20 సంవ త్సరానికి గాను 16కోట్ల 96లక్షల 549 విడుదలయ్యాయి. వీటికి సంబంధించి అన్ని సంఘాల్లోని మహిళలకు ప్రొసీడింగ్లు అందజేశాం. ఈమేరకు సంఘాల ఖాతాల్లో డబ్బులు కూడా జమచేశాం. దశల వారీగా వస్తున్న నిధు లు వెంట వెంట బ్యాంకు ఖాతాలో జమవుతున్నాయి. తీసుకున్న రుణాలు చెల్లించడంలో మ హిళలు ముందువరుసలో ఉన్నారు. బ్యాంకు ద్వారా పొందిన రుణాలను సద్వినియోగం చేసుకుంటూ వివిధ వ్యాపారాలు పెట్టుకుని రా ణిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహంతో చాలా మంది మహిళలు కుటీర పరిశ్రమలు పెట్టుకుని పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
– రవికుమార్, అడిషనల్ డీఆర్డీవో
అప్పు కోసం చేయిచాపెటోళ్లం
తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సార్ మ హిళలకు మంచి పథ కా లు తెచ్చిండు. మా గరీ బోళ్ల బిడ్డల పెళ్లిల్లకు షాదీ ముబారక్ కింద రూ. లక్షా నూటాపదహారు ఇచ్చి ఆదుకున్నడు. ఒకప్పుడు అప్పు కోసం అక్కడ ఇక్కడ చేయి చాపినోళ్లం. ఇయ్యాల తెలంగాణ గవ ర్న మెంటు అచ్చినంక బ్యాంకు రు ణా లిచ్చింది. ఎక్కడ కూడా చేయిచాచి అప్పు అడగట్లేదు. వడ్డీ పైసలు కూడా కేటీఆర్ ఏస్తానని చెప్పిండు. అన్న మాట నిలబెట్టుకున్నందుకు సార్కు సలామాలేకుమ్.
-ఎండీ అజీజా
మాలాంటి పేదలకు రందిలేదు
ఒకటా, రెండా సీఎం కేసీఆర్ ఎన్ని పథకాలు తెచ్చిండో. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు ఇలా చెప్పుకుంటూ పోతే వొడవదు. నాటి కాలం మెట్లుండే. కేసీఆర్ సార్ వచ్చినంక రోజులే మారినయ్. మా ఆడోళ్లకు పావలావడ్డీ రుణాలిచ్చి సంఘంలో గౌరవం పెంచిండు. తీసుకున్న వడ్డీతో అందరం వినియోగించుకుంటున్నం. నెలకాంగనె బ్యాంకు లో పైసలు కడుతున్నం. కేసీఆర్ సార్ ఉన్నంతకాలం మాలాంటి పేద మహిళలకు రంది లేదు. సారుకు రుణపడి ఉంటం.
-బండారి పుష్పలత