ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు
మున్సిపల్ పరిధిలోని వినాయక మండపాల సందర్శన
హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 15: తెలంగాణలో జరుపుకొనే పండుగలను గత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకునేవి కాదని, కానీ సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక నిధులు కేటాయించి గొప్పగా నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ పట్టణంతో పాటు మున్సిపల్ విలీన గ్రామాలైన కొత్తపల్లి, ఇందిరానగర్, బోర్నపల్లి, దమ్మక్కపేట, ఇప్పల్నర్సింగాపూర్లో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను బుధవారం గెల్లు శ్రీనివాస్ సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గణపతి మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, హిందువులతోపాటు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కుల పండుగల నిర్వహణకు సీఎం కేసీఆర్ అధికారికంగా నిధులు కేటాయించి గొప్పగా జరిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలని గణపతిని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మక్కపెల్లి కుమార్యాదవ్, కల్లెపల్లి రమాదేవి, గోస్కుల రాజు, కొండ్ర జీవిత, బాషబోయిన వనిత, మొలుగు సృజనాపూర్ణచందర్, టీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, కొండ్ర నరేశ్, బాషబోయిన కుమార్యాదవ్, సందమల్ల బాబు, బీఎస్ ఇమ్రాన్, పోరెడ్డి శంతన్రెడ్డి, గాలి రాకేశ్, ఆకుల శ్రీనివాస్, ఆకుల రవి, ఉప్పు శ్రీనివాస్, కల్లెపల్లి రోషేందర్, స్వామిరెడ్డి, విడపు అనురాగ్, చొల్లేటి శ్యామ్, పంజాల శ్రీధర్గౌడ్, కాజీపేట శ్రీనివాస్, రమేశ్యాదవ్ మండప నిర్వాహకులు తదితరులు ఉన్నారు.