కార్పొరేషన్, మే 13: హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధ్దికి అన్ని విధాలుగా కృషి చేస్తామని, త్వరలోనే మంత్రి కేటీఆర్తో కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అ న్నారు. గురువారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో 11 మంది బల్దియా టీఆర్ఎస్ కౌన్సిలర్లు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్న పనుల జాబితాను అందించాలని సూచించారు. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ క్యాడర్కు తాను అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధ్దిని ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నా రు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని తెలిపారు. పార్టీని చీల్చే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. అన్ని విధాలుగా నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, నేతలు సా మల రాజిరెడ్డి, శ్రీరాం, ఆకుల వెంకటేశ్, కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు. తోట రాజేంద్రప్రసాద్, కొలిపాక నిర్మల, తొగరు సదానందం, తాళ్లపల్లి రమేశ్, కొండాల్రెడ్డి, ఆర్కే రమేశ్, ఇమ్రాన్, కు మార్, అనిల్, లావణ్య, పూర్ణచందర్ ఉన్నారు.