వెల్గటూర్, ఏప్రిల్ 13: జగదేవ్పేట- శాఖాపూర్- కొండాపూర్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి రూ.2.04 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు గానూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటానికి కొండాపూర్లో నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సుధారాణి మాట్లాడుతూ, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో ధర్మపురి నియోజకవర్గానికి అనేక నిధులు వచ్చాయని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, సర్పంచులు బాలసాని రవి గౌడ్, మారం జలంధర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాంరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పదిరె నారాయణరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చల్లూరి రాంచందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్, నాయకులు కునమల్ల లింగయ్య, బొడ్డు రామస్వామి, గాగిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, పెద్దూరి భరత్, సప్ప రాజు, మూగల సత్యం, శేఖర్, కుమార్, మారం జగన్మోహన్రెడ్డి, శాఖాపూర్, కొండాపూర్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
నాయీబ్రాహ్మణుల ఆధ్వర్యంలో
కోరుట్ల, ఏప్రిల్ 13: పట్టణానికి చెందిన నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సంఘ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాచకొండ బుచ్చయ్య, పెద్ద దేవయ్య, ముత్యాల నాగరాజు, గంగాధర్, శంకర్, శ్రీనివాస్, రమేశ్, శేఖర్, రాజేంద్రప్రసాద్, రాజు, భూమయ్య, రాజం తదితరులు పాల్గొన్నారు.