కరీంనగర్ కలెక్టరేట్, మే 24 : గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన దివ్యాంగులకు, ఇంటర్మీడియట్లో ఉచిత విద్యావకాశాలు కల్పిస్తున్నట్టు కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 7.0 జీపీఏ, ఆపై ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్తోపాటు నీట్, ఎప్సెట్లో ఉచిత శిక్షణ అందించేందుకు, ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్టున్నట్టు చెప్పారు.
ఇప్పటికే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేశారని వెల్లడించారు. ఔత్సాహికులైన విద్యార్థులు ఈ నెల 30 లోగా ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన మొదటి విద్యార్ధుల జాబితా వచ్చే నెల 3న విడుదల చేస్తారని వివరించారు. విద్యార్ధుల ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత రెండో విడుతలో ఎంపికైన విద్యార్థుల జాబితా వచ్చే నెల 6న ప్రకటిస్తారని చెప్పారు.