అబద్ధాలకు కేరాఫ్ బీజేపీ
ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం
దీవించి అసెంబ్లీకి పంపించండి: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్
జమ్మికుంట మండలం రంగమ్మపల్లిలో కురుమల ఆత్మీయ సమ్మేళనం
జమ్మికుంట/జమ్మికుంట రూరల్, సెప్టెంబర్ 9: ‘ముఖ్యమంత్రి కేసీఆర్తోనే కురుమలకు న్యా యం జరిగింది.. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా గొర్రెల యూనిట్లు పంపిణీ చేసిన ఘనత ఆయనకే దక్కింది’ అని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం పేర్కొన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ 17 ఏండ్లపాటు టీఆర్ఎస్లో పదవులన్నీ అనుభవించిం డు.. ఇప్పుడు అవినీతి ఆరోపణలు రాగానే పార్టీని వీడిండు’ అంటూ ఆయన మండిపడ్డారు. అబద్ధాలకు కేరాఫ్గా మారిన బీజేపీలో ఎందుకు చేరాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం జమ్మికుంట మం డంలోని రంగమ్మపల్లిలో నిర్వహించిన కురుమల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. ఇటీవల ఇక్కడకు వచ్చిన బండారు దత్తాత్రేయ కురుమలను ఎస్సీల్లో చేర్చుతామని హామీ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఏం చేయలేని ఆయన, గవర్నర్గా ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. కురుమలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, గెల్లు శ్రీనును భారీ మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తర్వాత ఆయనను కురుమ సంఘం నాయకులు ఘనం గా సన్మానించారు. కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ చీరెల్ల సంపత్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, పటాన్ చెరువు కార్పొరేటర్ నగేశ్, యూత్ అధ్యక్షుడు అరుణ్కుమార్, మాజీ కార్పొరేటర్ సదానందం, నాయకులు నరేశ్కుమార్, రాజ్కుమార్, కొమురయ్య, సదానందం ఉన్నారు.
ఆదరించి అసెంబ్లీకి పంపించండి