ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పరాభావం తప్పదు
నేతలందరూ ఏకతాటిపై ఉన్నారు
క్రాస్ ఓటింగ్కు అవకాశం లేదు
మంత్రులు కేటీఆర్, గంగుల
కార్పొరేషన్, డిసెంబర్ 8: రానున్న ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, టీ భానుప్రసాద్రావు ఎన్నిక ఏకపక్షమేనని.. ప్రజాప్రతినిధులందరూ ఏకతాటిపై ఉన్నారంటూ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఘోర పరాభావం తప్పదని వ్యాఖ్యానించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు రిసార్ట్లో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు ఈనెల 10 న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, గంగుల కమలార్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. కొందరు నాయకులు క్రాస్ఓటింగ్పై కలలు గంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రెస్మీట్లు పెట్టి గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్కు 994 ప్రజాప్రతినిధుల బలముందని పేర్కొన్నారు. ప్రత్యర్థులది దింపుడు కల్లెం ఆశ అని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి నిరాశ తప్పదని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎల్ రమణ, టీ భానుప్రసాద్రావు, కరీంనగర్ మేయర్ వై సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.