భూసారం పెంపునకు కోడి ఎరువు వినియోగం
పాత పద్ధతే శ్రేయస్కరం
ఓదెల, డిసెంబర్ 8: సేంద్రియ ఎరువుల వైపు రైతాంగం ఆసక్తి చూపుతున్నది. భూసారం పెంపునకు కోడి ఎరువు వినియోగిస్తున్నది. నేలకు సహజ పోషకాలు అందుతుండగా.. పం టలకు బలం చేకూరనున్నది. రసాయన ఎరువులతో భూమితో పాటు మానవాళికి జరిగే అనర్థాలను వ్యవసాయ శాఖ అధికారులకు తెలుపుతూ వస్తున్నారు. రైతు వేదికల నిర్మాణాలతో రైతులకు అనేక లాభాలు జరుగుతున్నాయి. ఈ వేదికల్లో రైతులకు లాభసాటి వ్యవసాయంపై ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఇంట్లోని సేంద్రియ ఎరువు వాడడమే అన్ని రకాల శ్రేయస్కరమని రైతులకు అవగతం అవుతుంది. అలాగే పలు వురు రైతులు వివిధ పట్టణాల నుంచి కోడి ఎరువును తెప్పించుకుని వ్యవసాయ భూముల్లో పోసుకుంటున్నారు. ఇందుకు హైదరాబాద్ నుంచి లారీల్లో కోడి ఎరువును తెప్పించి భూముల్లో వేసుకుంటున్నారు. ఓదెల మండలంలోని పలు గ్రామాలకు హైదరాబాద్ నుంచి కోడి ఎరువు లారీలు వస్తున్నాయి. 4 ఎకరాల భూ మికి రసాయన ఎరువులకు రూ.40వేల ఖర్చు వస్తే, కోడి ఎరువు రూ.21 వేలతో సరిపోతుందని రైతులు తెలుపుతున్నారు. సేంద్రియంతో ఖర్చు తగ్గడంతోపాటు ఏ అనర్థాలకు తావు లేదంటున్నారు. అలాగే ఇండ్లల్లో జమచేసే పశువుల పేడ, చెత్తాచెదారంతో పెంటను పోసుకుంటున్నారు. నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందుతాయి.