ఓదెల/ఎలిగేడు/జూలపల్లి, నవంబర్ 5: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఓదెల మండలం గుండ్లపల్లి, కనగర్తి, పిట్టల ఎల్లయ్యపల్లె, ఎలిగేడు మండల కేంద్రంతోపాటు రాములపల్లి, ధూళికట్ట, నర్సాపూర్, జూలపల్లి మండలం తేలుకుంట, చీమలపేట, నాగులపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అలాగే జూలపల్లి మండలం పెద్దాపూర్లో గంగపుత్రుల సామాజిక భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. తేలుకుంటలో రామప్ప చెరువును పరిశీలించి, మత్తడి పనుల కోసం నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఓదెల ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, కావటి రాజు, ఐరెడ్డి వెంకట్రెడ్డి, రాజిరెడ్డి, సదాశివ, రవికుమార్, శ్రీకాంత్, తిరుపతిరెడ్డి, దామోద్రెడ్డి, సరిత-రవికుమార్, సరోజన, మొండయ్య, సదానందం, మహేందర్, స్వామి, శేఖర్, ఎలిగేడు విండో చైర్మన్ గోపు విజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, మాడ కొండాల్రెడ్డి, చిలుముల సౌమ్య, గొల్లె కావేరి, తంగెళ్ల స్వప్న, బూర్ల సింధూజ, కొండయ్యరాజా, గోపు విజేందర్రెడ్డి, పెద్దోళ్ల అయిలయ్య, దేవరనేని ప్రభావతి, వెంకటసత్యం, మోహన్రావు, తిరుపతిరెడ్డి, జూలపల్లి ఏఎంసీ చైర్మన్ కంది చొక్కారెడ్డి, వైస్ చైర్మన్ లోక రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, సర్పంచులు దారబోయిన నరసింహం, పొలవేని వీరయ్య, సొల్లు పద్మ, తొంటి పద్మ, ధూళికట్ట, ఎలిగేడు విండో చైర్మన్లు పుల్లూరి వేణుగోపాల్రావు, గోపు విజయభాస్కర్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్రెడ్డి, డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.