కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): జిల్లాలో భూసంబంధ సమస్యలను ఈనెల 5వ తేదీలోగా పరిష్కరించాలని కలెక్టర్ కే శశాంక ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ సంబంధ సమస్యలపై ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో లేకుండా పరిషరించాలన్నారు. భూ వివాదాలు ఏమైనా ఉంటే ఈ నెల 5వ తేదీలోగా పూర్తి చేసి, రైతులకు రైతుబంధు పథకం వర్తించే విధంగా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ఆర్డీవో ఆనంద్కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు శ్రీదేవి, అనంతరెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది, ధరణి కో-ఆర్డినేటర్లు, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
విద్యానగర్, జూన్ 1: కరోనా పాజిటివ్ కేసులు ఎకువగా ఉన్న గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన కొవిడ్ నియంత్రణ చర్యలపై వైద్యాధికారులు, నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, కొత్తపల్లి, మానకొండూర్, రామడుగు, తిమ్మాపూర్, హుజూరాబాద్, ఇల్లందకుంట మండలాల్లోని 38 గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎకువగా నమోదైనట్లు తెలిపారు. సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, టాస్ఫోర్స్ టీంలు ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను సంప్రదించి ప్రభుత్వ పాఠశాలల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కొవిడ్ బాధితులను ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పాజిటివ్ వచ్చిన వారు ఐసొలేషన్లో ఉంటేనే కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. ఇంటింటా జ్వర సర్వేలో మెడికల్ కిట్లు ఇచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు. పాజిటివ్ రేట్ ఎకువగా ఉన్న గ్రామాల్లో మండల టాస్ఫోర్స్ టీంలు మూడు రోజుల్లో పర్యటించి హోం ఐసొలేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొబైల్ టీంల ద్వారా గ్రామాల్లో కరోనా నిర్ధారణ పరీక్షల శిబిరాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని పీహెచ్సీల్లో పోస్ట్ కొవిడ్ ప్రత్యేక ఓపీ సేవలను ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అందించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. కోలుకున్న కొవిడ్ బాధితులను సంబంధిత ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రోత్సహించి కొవిడ్ ఓపీ సేవలకు తీసుకురావాలన్నారు. జిల్లాలో రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోకుండా ఓవర్ డ్యూ వారు 5,200 మంది ఉన్నారని, వారిని గుర్తించి వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని ఆదేశించారు. ఇంటింటా జ్వర సర్వే కొనసాగించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సాజిదా, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, ప్రోగ్రాం ఆఫీసర్లు, డీటీసీవో డాక్టర్ రవీందర్రెడ్డి, డాక్టర్లు సుధాకర్రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.