సుల్తానాబాద్ రూరల్, సెప్టెంబర్ 23: స్వరాష్ట్రంలోనే బతుకమ్మ పండుగకు గుర్తింపు వచ్చిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొపుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఆయన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధికారంలో ఉన్న పాలకులు మహిళల బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రం అవిర్భావంతోనే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలు అధికారికంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ పది లక్షల మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలోనే 2 లక్షల 50 వేల మందికి చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ వెను క గొప్ప ఆంతర్యం ఉందన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ముఖ్యమం త్రి కేసీఆర్ చీరలను పంపిణీ చేయాలని సంకల్పించారని పేర్కొన్నారు. బతుకమ్మను ప్రపంచ దేశాలకు తీసుకెళ్లిన ఘనత ఎమ్మెల్సీ కవితదేనన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సంగీత సత్యనారాయణ, డీఆర్డ్వో వీ శ్రీధర్, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ కాసర్ల అనంతరెడ్డి, తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవో శశికళ, జడ్పీటీసీ సభ్యురాలు మినుపాల స్వరూపరాణి, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, విండో చైర్మన్ జూ పల్లి సందీప్రావు, వైస్ ఎంపీపీ కోట స్వప్న-రాంరెడ్డి, సర్పంచులు వీరగోని సుజాత-రమేశ్గౌడ్, ఇరుగురాళ్ల అనిత-తిరుపతి, సుంక లావణ్య-వెంకట్, కవ్వంపల్లి జమున-తిరుపతి, కల్వల శ్రావణ్కుమార్, గుజేటి దెవమ్మ-వెంకన్న, ఏంపీవో ఫయాజ్ అలీ, ఎంపీటీసీ అ నూష, ఉపసర్పంచ్ మధు, కార్యదర్శి ప్రశాం త్, వార్డు, కో-అప్షన్ సభ్యులు ఉన్నారు.