వీణవంక, జూలై 31: ముఖ్యమంత్రి కేసీఆర్తోనే తెలంగాణ ప్రజల కలలు సాకారమవుతాయని, అన్నిరంగాల్లో గ్రామాల అభివృద్ధి జరుగుతున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. శనివారం వీణవంకలో జరిగిన కార్యక్రమంలో చల్లూరు, ఎలుబాక గ్రామాల్లోని 80 మంది బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్సీ నారదాసుతో కలిసి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పేద ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ నుంచి చేరడానికి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఒక ప్రత్యేకమైన కుట్రకు తెరలేపిందని, అది నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.
బీజేపీతో ఒరిగేదేం లేదు..
గ్రామాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పేర్కొన్నారు. బీజేపీతో ఒరిగేదేం లేదని చెప్పారు. వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీదే విజయమని, నూతనంగా చేరిన వారితో పార్టీకి మరింత బలం చేకూరిందని చెప్పారు. ప్రజలు నిండుమనసుతో సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి టీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, నాయకులు పొదిల రమేశ్, కాంతారెడ్డి, రాజయ్య, తాండ్ర శంకర్, జీవన్ ఉన్నారు.
రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
దేశాయిపల్లి పీఎస్కే గార్డెన్లో 371 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు, 16 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్సీ నారదాసు పంపిణీ చేశారు. పేద ప్రజల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్తో ఏండ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, కేవలం స్వార్థం, పదవుల కోసమే ఓట్లడగడానికి వస్తారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, కో ఆప్షన్మెంబర్ హమీద్, సర్పంచులు గంగాడి సౌజన్య, జున్నూతుల సునీత, మోరె సారయ్య, పర్లపెల్లి రమేశ్, ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి, తహసీల్దార్ సరిత, ఆర్ఐలు ప్రవీణ్, రవి, నాయకులు ఒడ్డెపెల్లి రాజయ్య, సంగ సమ్మయ్య, పాకాల గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గొప్ప నాయకుడు
టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పార్టీలో చేరిన. ఇప్పటిదాకా కాంగ్రెస్లో పనిచేసిన. ఏం ప్రయోజనం లేదు. సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడు. ఆయన కృషితోనే గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నది. పేద ప్రజలకు ఎంతో మేలవుతున్నది. వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసి విజయానికి కృషిచేస్త.
అభివృద్ధిని చూసే చేరా..
బీజేపీ, కాంగ్రెస్తో పేదలకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఆ పార్టీల్లో అన్నీ గ్రూపు రాజకీయాలు తప్ప ఇంకేం ఉండవు. రాష్ట్ర సర్కారు పథకాలు నన్నెంతో ఆకర్షించాయి. అందుకే పార్టీలో చేరిన. దళితబంధు అద్భుత పథకం. దళితుల జీవితాలే మారిపోతాయి. టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటా. పనిచేస్త.