గంగాధర, ఆగస్టు 17: కరోనా సంక్షోభంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 41 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ. 9 లక్షల 15 వేల 500 విలువైన ఆర్థిక సాయం మంజూరైంది. గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటున్నారని తెలిపారు. కాగా, ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్రెడ్డి, శ్రీమల్ల మేఘరాజు, ముక్కెర మల్లేశం, జోగు లక్ష్మీరాజం, ఎండీ నజీర్, రాసూరి మల్లేశం, ఎంపీటీసీ మధుసూదన్రెడ్డి, నాయకులు ఆకుల మధుసూదన్, దూలం శంకర్గౌడ్, ముద్దం నగేశ్, రామిడి సురేందర్, వేముల అంజి, మల్లయ్య, మ్యాక వినోద్ పాల్గొన్నారు.