చొప్పదండి, ఏప్రిల్ 19: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. సోమవారం చొప్పదండి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో, భూపాలపట్నం, వెదురుగట్ట, రుక్మాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, వైస్ ఎంపీపీ మునిగాల విజయలక్ష్మి, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, వైస్ చైర్మన్లు కొత్త గంగారెడ్డి, ముద్దం మల్లేశం, సర్పంచ్ సుచరితాదేవి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు గొల్లపల్లి శ్రావణ్కుమార్, గన్ను శ్రీనివాస్రెడ్డి, కో ఆప్షన్ పాషా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొల్లూరి ఆనందం, బీసవేని రాజశేఖర్, చెట్టిపల్లి పద్మ, పెద్ది లక్ష్మీకాంతం, కుమార్, శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, పబ్బ సత్యం, మావూరం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.