విజేతగా హుజూరాబాద్ క్రికెట్ క్లబ్
రన్నరప్గా పెద్దపాపయ్యపల్లి జట్టు
బహుమతులు ప్రదానం చేసిన బండ, గెల్లు
హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 5: పట్టణంలోని హైసూల్ క్రీడా మైదానంలో గత 20 రోజులుగా ఉతంఠగా సాగిన నిమ్మటూరి రాజేశ్వరి స్మారక క్రికెట్ పోటీల్లో విజేతగా హుజూరాబాద్ క్రికెట్ క్లబ్ నిలిచింది. మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ హుజూరాబాద్ క్రికెట్ క్లబ్- పెద్దపాపయ్యపల్లి మధ్య జరుగగా పట్టణ సీఐ వీరబత్తిని శ్రీనివాస్ ప్రారంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హుజూరాబాద్ క్లబ్ టీం 15 ఓవర్లలో 225 పరుగులు చేయగా, పెద్దపాపయ్యపల్లి జట్టు 75 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 150 పరుగులతో హుజూరాబాద్ క్రికెట్ క్లబ్ గెలిచింది. సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవానికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్ హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. మొదటి బహుమతి హుజూరాబాద్ క్రికెట్ క్లబ్కు మెమెంటోతో పాటు రూ.30వేల క్యాష్ ప్రైజ్, రన్నరప్ పెద్దపాపయ్యపల్లి జట్టుకి రూ.15వేల క్యాష్ ప్రైజ్తో పాటు మెమెంటోను అందజేశారు. కొన్నేళ్లుగా వరుసగా రాజేశ్వరి స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సాయికృష్ణను అతిథులు అభినందించారు. గ్రామీణ స్థాయి నుంచే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదుగుతారని, యువత క్రీడలపట్ల ఆసక్తిని కనబర్చాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కన్నెబోయిన శ్రీనివాస్యాదవ్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ భూసారపు బాబూరావు, టీఆర్ఎస్ నాయకులు మొలుగు ప్రభాకర్, మధుకర్రెడ్డి, నిర్వాహకులు సాయికృష్ణ, బండా రి లవన్కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు.