చిగురుమామిడి, జూలై 28: టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ విభేదాలు సృష్టిస్తే ఎలాంటి వారిపైనైనా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఎంపీ పీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్ టీఆర్ఎస్ జిల్లా నేత కొత్త శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, రైతు బం ధు సమితి జిల్లా సభ్యులు సాంబారి కొముర య్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి మల్లేశం పేర్కొన్నారు. మండలకేంద్రంలో బు ధవారం విలేకరులతో మాట్లాడారు. హుస్నాబా ద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అనే క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే కొంద రు జేఎస్ఆర్ టీం ఏర్పాటు చేసుకొని ఇది తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిం చారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పార్టీ నిబంధనలు పాటించాలని కోరారు. జన్నపరెడ్డి సు రేందర్రెడ్డి పార్టీకి సమాచారం లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీశ్కుమార్, రాష్ట్రంలో సీఎం కేసీఆరే మా నాయకులని పేరొన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సీఎం దళితబంధు పథకాన్ని ప్రకటించారని, ఇది ఒర్వలేని ప్రతిపక్షాల నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టా రు. దళిత బంధుతో దళిత కుటుంబాలు ఆ నందాన్ని వ్యక్తం చేస్తుంటే కొన్ని పార్టీలు అదే పనిగా విమర్శించడం సరికాదన్నారు.
జేఎస్ఆర్ టీం స భ్యులు గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. మండలంలో జేఎస్ఆర్ టీంకు టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు టీం కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్దేశించారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఎస్కే సి రా జ్, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, సన్నీల వెంకటేశం, మండల నాయకులు మామిడి అంజయ్య, బుర్ర తిరుపతి, ఆకవరం శివప్రసాద్, బెజ్జంకి అం జయ్య, బెజ్జంకి రాంబాబు, అన్నాడి మల్లికారున్రెడ్డి, పోటు మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.