కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు ధాన్యాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ను జారీ చేయాలని కలెక్టర్ కే శశాంక ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అదనపు కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా మారెటింగ్ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్, జిల్లా సరఫరా అధికారి, ప్యాక్స్ సీఈవోలు ఐకేపీ ఏపీఎంలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణపై జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన ఎఫ్ఏక్యూ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, లేకుంటే ధాన్యం కొనుగోలు సెంటర్ ఇన్చార్జి, కొనుగోలు కేంద్రంపై చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనమోదు చేయాలని చెప్పారు.
ఆన్లైన్లో డాటా నమోదు చేసిన వెంటనే రైతులకు పేమెంట్ జరుగుతుందని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం శుభ్రపరిచే యంత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో ఇంతవరకు 352 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, వీటి ద్వారా 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.39 కోట్ల రూపాయలను రైతులకు వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. జూమ్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్, డీఆర్డీవో శ్రీలత, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా మారెటింగ్ అధికారి పద్మావతి, డీసీవో మనోజ్, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, జిల్లా సరఫరా అధికారి సురేశ్రెడ్డి, ప్యాక్స్ సీఈవోలు, మండల వ్యవసాయాధికారులు, ఐకేపీ ఏపీఎంలు పాల్గొన్నారు