‘నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటుకున్న శకి్తపై జాతీయ స్థాయి అవగాహన పోటీలు
క్విజ్, స్లోగన్స్, సాంగ్స్,వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్ గేమ్స్
విభాగాల వారీగా 30వేల నుంచి 2లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు
ఎంట్రీలకు వచ్చే నెల 15వ తేదీ వరకు అవకాశం
ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలి : ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ):ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. అలాంటి ఓటు విలువ తెలియజెప్పడంతోపాటు సృజనాత్మకత, కళాత్మక విలువలను వెలికి తీసేందుకు ఎన్నికల కమిషన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటుకున్న శకి’్త అంశంపై జాతీయ స్థాయిలో అవగాహన పోటీలు నిర్వహించబోతున్నది. క్విజ్, స్లోగన్స్, సాంగ్స్, పోస్టర్ డిజైన్ గేమ్స్, వీడియో మేకింగ్.. ఇలా ఐదు కేటగిరీల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నది. ఎంట్రీలకు వచ్చే నెల 15వ తేదీ వరకు గడువు విధించినట్లు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటుకున్న శకి’్త అనే అంశంపై భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవం- 2022 సందర్భంగా అవగాహన పోటీ నిర్వహిస్తున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమం ద్వారా ప్రజల్లో దాగి ఉన్న సృజనాత్మక, కళాత్మక విలువలను వెలికితీస్తూ, తద్వారా భారతీయ ప్రజాస్వామ్య పునాదులను దృఢం చేసేందుకు గాను అన్ని వయసుల వారు ఇందులో పాల్గొనేలా, ఓటు విలువలను పెంపొందించేలా పోటీలను నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఐదు కేటగిరీల్లో పోటీలు..
కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో ఐదు కేటగిరీలుంటాయి. క్విజ్, స్లోగన్స్, సాంగ్స్, పోస్టర్ డిజైన్ గేమ్స్, వీడియో మేకింగ్. క్విజ్ పోటీలో మూడు స్థాయిలు తేలిక, మధ్యస్థం, కఠినం ఉంటాయి. స్లోగన్స్ పోటీలో పాల్గొనే అభ్యర్థులు చకటి పదాలతో చకటి భావాలతో పైన తెలిపిన అంశంపై మనసుకు హత్తుకునే నినాదాలు రాయాల్సి ఉంటుంది పాటల పోటీలో పాల్గొనే అభ్యర్థులు శాస్త్రీయ సంగీతం, సమకాలీన సంగీతం, రాప్ తదితర వాటిని ఎంచుకోవచ్చని తెలిపారు. సొంత కంపోజిషన్ మాత్రమే పాడాలి. పాట నిడివి మూడు నిమిషాలకు మించి ఉండవద్దు. వీడియో మేకింగ్ గేమ్లో పాల్గొనే వారు భారతీయ ఎన్నికల నిర్వహణ వైభవం, విభిన్నత తదితర అంశాలపై షార్ట్ఫిలిం రూపొందించాల్సి ఉంటుంది. వాటితో పాటు ప్రజలకు ఓటుపై అవగాహన, నైతిక ఓటింగ్, ఓటుకున్న శక్తి, ఓటింగ్ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, నవ యువత, మొదటిసారి ఓటు వేస్తున్న ఓటర్లు తదితర స్ఫూర్తినింపే అంశాలపైన చిత్రాలు కూడా తీయవచ్చు. వీడియో ఫిలిం నిడివి కేవలం ఒక నిమిషం మాత్రమే ఉండాలి. పోస్టర్ డిజైన్ పోటీల్లో పాల్గొనే వారు ఆలోచనలను రేకెత్తించే స్ఫూర్తివంతమైన పోస్టర్స్ను సృష్టించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక డిజిటల్ పోస్టర్, హ్యాండ్ పెయింటెడ్ పోస్టర్లను సమర్పించాల్సి ఉంటుంది.
పోటీ కేటగిరీలు
ఇనిస్టిట్యూషనల్ కేటగిరీలో విద్యాసంస్థలు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించి గుర్తింపు పొందిన పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు) ఉంటాయి.ప్రొఫెషనల్ కేటగిరిలో ఎవరైతే తాము వీడియో మేకింగ్, పోస్టర్ డిజైనింగ్, పాటలు పాడడం ప్రధాన వృత్తిగా స్వీకరించి తమ ప్రధాన ఆదాయ వనరుగా, దానిపై ఆధారపడి జీవించేవారు. వీరే వృత్తి నిపుణులు. ఒకవేళ వీరు సెలక్ట్ అయితే తాము ప్రొఫెషనల్ కేటగిరీకి చెందుతామని ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.అమెచ్యూర్ కేటగిరీలో వీడియో మేకింగ్, పో స్టర్ డిజైనింగ్, గానం ఒక హాబీగా తమలోని కలను నిరూపించుకోవడానికి, వారు తమ ప్రధాన ఆదాయ వనరుగా వేరే పని చేస్తూ ఉంటారో వారు ఔత్సాహికుల కిందికి వస్తారు.
విజేతలకు భారీ నగదు ప్రోత్సాహకం..
ప్రతి కేటగిరీలో అత్యుత్తమంగా నిలిచిన ముగ్గురు విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రం అందజేస్తారు. పాటల పోటీలో ఇనిస్టిట్యూషనల్ కేటగిరీలో ప్రథమ బహుమతిగా లక్ష, ద్వితీయ 50 వేలు, తృతీయ 30వేలు, ప్రొఫెషనల్లో ప్రథమ 50వేలు, ద్వితీయ 30వేలు, తృతీయ బహుమతిగా 20వేలు, అమెచ్యూర్లో ప్రథమ 30వేలు, ద్వితీయ 20 వేలు, తృతీయ బహుమతిగా 10వేలు ఇవ్వనున్నారు. వీడియో మేకింగ్ పోటీలో ప్రథమకు రూ.2లక్షలు, ద్వితీయకు లక్ష, తృతీయ బహుమతిగా 75 వేలు ఇస్తారు. ఇక పోస్టర్ డిజైన్ పోటీలో ప్రథమకు 50 వేలు, ద్వితీయకు 30 వేలు, తృతీయ బహుమతిగా 20 వేలు ఇవ్వనున్నారు. పోటీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు http/ecisveep.nic.in/contest వెబ్సైట్ను సందర్శించి తమ వివరాలతో పాటు ఎంట్రీలను voter-contest @eci.gov. inకు ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. విద్యార్థి తాను పంపుతున్న పోటీ పేరు, కేటగిరీలను ఈ మెయిల్ సబ్జెక్టులో స్పష్టంగా రాయాలి. కాగా, ఎంట్రీలకు వచ్చే నెల 15 చివరి తేదీ అని కలెక్టర్ తెలిపారు.