అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 18: పట్టణంలోని ఆరో వార్డులో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ మిద్దె రవన్న ఆధ్వర్యంలో, ఏడో వార్డులో పార్టీ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సిద్దిపేట కౌన్సిలర్ శ్రీహరి ఆధ్వర్యంలో, 15వ వార్డులో పట్టణ మహిళా అధ్యక్షురాలు, కౌన్సిలర్ కల్లెపల్లి రమాదేవి ఆధ్వర్యంలో, 12వ వార్డులో కౌన్సిలర్ తొగరు సదానందం, 13వ వార్డులో కొండ్ర జీవిత, 14 వార్డులో టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గంట మధూకర్, 24 వార్డులో టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు పోతరవేణి అనిల్యాదవ్, 29వ వార్డు కౌన్సిలర్ ముక్క రమేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆయా చోట్ల ప్రచారంలో కరీంనగర్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, మాజీ వార్డు సభ్యుడు కొండపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కొయ్యడ కమలాకర్గౌడ్, మాజీ ఎంపీటీసీ కొయ్యడ శ్రీదేవి, మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సబ్బని రమేశ్, సిద్దిపేట కౌన్సిలర్ శ్రీహరి, నాయకులు నల్ల బాలరాజు, కే పవన్, కొలిపాక యాదగిరి, శ్రీకాంత్, సురేశ్, సాత్విక్, యూత్ సభ్యులు వలబోజు తిరుమల్, కార్తీక్, క్రాంతి, చందు, ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 18: మండలంలోని తుమ్మనపల్లి, సిర్సపల్లి, సింగాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ యువనాయకుడు వొడితల ప్రణవ్బాబు ఆధ్వర్యంలో యువకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించి వివరించారు. కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.
5వ వార్డులో..
హుజూరాబాద్ చౌరస్తా, అక్టోబర్ 18: పట్టణంలోని ఐదో వార్డులో టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అపరాద ముత్యంరాజు, నాయకులు ఎడ్ల అశోక్, సారయ్య, హరీశ్, రవి, రాజు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, అక్టోబర్ 18: మండలంలోని కోరపల్లి గ్రామంలో సర్పంచ్ రమ-రాజయ్య, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు సురేశ్, నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు సతీశ్కుమార్, విజయ్కుమార్, సారంగం, రవి, కుమార్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో..
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు మద్దతుగా మండలంలోని బేతిగల్ గ్రామంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ప్రచారం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. బొగ్గు గనులను బడా వ్యాపారులకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీజీబీకేఎస్ ఆర్జీ-3 డివిజన్ ఉపాధ్యక్షులు గౌతమ్, శంకరయ్య, కార్యదర్శి పూర్ణకర్, దామోదర్, మల్లారెడ్డి, రవీందర్, సర్పంచ్ మోరె సారయ్య తదితరులు పాల్గొన్నారు.