గంగాధర, ఫిబ్రవరి 11: రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో భాగంగా నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి బోయినపల్లి మండలం స్తంభంపల్లి వరకు చేపట్టిన కుడి కాలువ నిర్మాణ పనులను శుక్రవారం మధురానగర్ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుడికాలువ నిర్మాణం పూర్తయితే గంగాధర, బోయినపల్లి మండలాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 2009లో ఎల్లంపల్లి కుడి కాలువ పనులు ప్రా రంభించినా అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో ముందుకు సాగలేదని గుర్తు చేశారు. 2014లో తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభమైనా రైతులు అభ్యంతరం చెప్పగా ఆగిపోయినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక కాలువల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కుడికాలువ కింద భూము లు కోల్పోతున్న నిర్వాసితులను ఒప్పించడంతో పాటు, అధికారులతో సమావేశాలు నిర్వహించి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. పనులు చివరిదశలో ఉన్నాయని, వంతెనల నిర్మాణం, చిన్నచిన్న పనులు మిగిలి పోయాయని, త్వరలో పూర్తి చేస్తామన్నారు. గంగాధర విండో చైర్మన్ దూలం బాలగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, నాయకులు వేముల అంజి, అట్ల శేఖర్రెడ్డి, వడ్లూరి ఆదిమల్లు, పెంచాల చందు, మ్యాక వినోద్, శ్రీధర్ పాల్గొన్నారు.