కామారెడ్డి : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలుస్తుందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజురైన 12 మందికి 9 లక్షల 74వేల రూపాయల చెక్కులను ఆయా కుటుంబాలకు ఆయన అందజేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 967 మందికి కామారెడ్డి నియోజకవర్గం లో ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.5 కోట్ల 91 లక్షల చెక్కులను పంపిణీ చేశామన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు బాసటగా నిలుస్తుందన్నారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్నీ వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందిస్తూ కేసీఆర్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలి పారు. ప్రతి లబ్ధిదారుడుకి సంక్షేమ ఫలాలు అందించడం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. ఈ చెక్కుల పంపిణి కార్యక్రమంలో మాచారెడ్డి జడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ బల్వంత్ రావ్, నాయకులు లక్కాకుల రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.