జక్రాన్పల్లి, ఆగస్టు 5: మండలంలోని వివేక్నగర్ తండాకు చెందిన కార్తిక్ రమేశ్ నాయక్ బంజారా కథలను తెలుగులోకి అనువ దించిందిన ఢావ్లో కథల పుస్తకాన్ని ఎంపీపీ డీకొండ హరిత గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బంజా రా భాషలోని కథలను తెలుగులోకి అనువదించడం గొప్ప విషయమని అభినందించారు. చిన్న వయసులోనే సాహిత్యంలో రాణించడం చాలా సంతోషమని, బంజారా యువకులందరూ కార్తిక్ రమేశ్ నాయక్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.
బంజారా భాషలో ఉన్న అద్భుతమైన కథలు తెలుగు వారికీ తెలిసేలా పట్టుదలతో అనువదించడంపై ప్రశంసించారు. గోర్ బంజారా భాషలోని కథలను తెలుగులోకి అనువదించిన తొలి రచయితగా కార్తిక్ రమేశ్ నాయక్ నిలుస్తాడన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య సూర్యధనుంజయ్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ త్రివేణి, పద్యకోకిల, అష్టావధాని బోచ్కర్ ఓం ప్రకాశ్ హాజరుకాగా, సర్పంచ్ దూళీబాయి మంగ్త్యనాయక్, ఎంపీటీసీ మరియాసతీశ్, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్ నాయక్, చాంద్మియా తండా సర్పంచ్ కిషన్ నాయక్, కార్తిక్ రమేశ్ నాయక్ తల్లిదండ్రులు సేవంత్బాయి-మోజీరాం నాయక్, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.