ఇందూర్, ఆగస్టు 3 : హెల్త్వీక్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని 48వ డివిజన్ పరిధిలోగల పాటిగల్లీ, తొమ్మిదో డివిన్లోని ఒడ్డెర కాలనీలో మంగళవారం చేపట్టిన సర్వేను ఆయన పర్యవేక్షించి సిబ్బందితో మాట్లాడారు. ఎవరైనా కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వే సందర్భంగా గుర్తిస్తే వెంనే మెడికల్ కిట్ను అందజేయాలని, బాధితులు ప్రతిరోజూ మందులు వాడుతున్నారా? లేదా? అని పర్యవేక్షించాలని సూచించారు. కొవిడ్-19, క్యాన్సర్, హెచ్ఐవీ, తలసేమియా, టీబీ, డయాలసిస్ సమస్యలతో బాధపడేవారిని గుర్తించేందుకు ప్రతిఇంటినీ సందర్శించి వివరాలు నమోదు చేయాలని, బాధితులకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వే వివరాలను వెంటనే ప్రత్యేక యాప్లో పొందుపర్చాలన్నారు.
సర్వే సందర్భంగా సేకరించిన వివరాలు నమోదు చేస్తున్న రిజష్టర్ను పరిశీలించారు. అనంతరం నాగారం స్టేడియంలో ఉన్న పట్టణ ప్రకృతి వనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆయనవెంట కార్పొరేటర్ వనితాశ్రీనివాస్, ఇన్చార్జి డీఎంహెచ్వో సుదర్శనం, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.