డిచ్పల్లి/ఇందల్వాయి/నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 26: టీఎస్ ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలను చేపట్టి తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇందల్వాయి మండలంలోని చాంద్రాయన్పల్లి వద్ద బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ జెండాను ఎగురవేసి, అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో కలిసి నివాళి అర్పించారు. ర్యాలీగా బయల్దేరి గన్నారం కమాన్ వద్ద తెలంగాణ తల్లి, ఇతర మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద మండల నాయకులు క్రేన్ ద్వారా బాజిరెడ్డి గోవర్ధన్ మెడలో గజమాల వేశారు. స్వాగతం పలికిన వారిలో ట్రైనీ ఐఏఎస్ మకరంద్, ఆర్డీవో రవి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో రాములు నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ జగన్, ఎంపీపీ రమేశ్నాయక్, జడ్పీటీసీ గడ్డం సుమన, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, సొసైటీ చైర్మన్ చింతల్పలలి గోవర్ధన్రెడ్డి, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. డిచ్పల్లి మండలంలోని నాగ్పూర్ గేటు వద్ద నాయకులు పటాకులు కాలుస్తూ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా డిచ్పల్లికి చేరుకొని అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. బాజిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ వీజీ గౌడ్ను గజమాలతో సత్కరించారు. నాయకులు నృత్యాలు చేస్తూ.. జై కేసీఆర్, కేటీఆర్, కవిత నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, టీఆర్ఎస్ డిచ్పల్లి మండలాధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒడ్డెం నర్సయ్య, రైతుబంధు కో-ఆర్డినేటర్ నారాయణరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మోహన్రెడ్డి, విండో చైర్మన్లు శ్రీనివాస్రెడ్డి, తారాచంద్ తదితరులు పాల్గొన్నారు.