కామారెడ్డి, మే 21: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యురాలిగా సుమిత్రానంద్ తానోబా హైదరాబాద్లోని పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యాలయంలో శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, సుమిత్ర భర్త ఆనంద్రావు, సోదరుడు బాలాజీరావు హాజరయ్యారు.
పలువురి అభినందన..
పదవీ ప్రమాణం చేసిన తర్వాత పలువురు మంత్రులను సుమిత్రానంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వంగా కలిశారు. తొలుత ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మంత్రులు హరీశ్రావు, మహమూద్అలీ, ప్రశాంత్రెడ్డిని కలిశారు. ప్రశాంత్రెడ్డి ఆయన సతీమణి నీరజారెడ్డి సుమిత్రానంద్కు శాలువా కప్పి సన్మానించారు. హోంమంత్రి మహమూద్అలీని ఆయన నివాసంలో కలిసిన సుమిత్రానంద్ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆయన నివాసంలో సుమిత్రానంద్ తన కుటుంబ సభ్యులతో కలిసారు. ఆదర్శవంతమైన సేవలను అందించాలని మంత్రి హరీశ్రావు ఆమెకు సూచించారు.