నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇద్దరు అనుమానిత వ్యక్తుల చొరబాటు కలకలం రేపుతున్నది. మధ్యాహ్నం సమయంలో దవాఖానలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న పేషెంట్లను ఇద్దరు వ్యక్తులు ఫొటోలు, వీడియోలు తీస్తూ హాస్పిటల్ వర్గాల కంట పడ్డారు. అనుమానిత వ్యక్తులను వైద్య సిబ్బంది పట్టుకొని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు తెలిపారు.
దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్కు సమాచారం ఇవ్వగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇరువురు వ్యక్తులు అంబులెన్స్ డ్రైవర్ల లేదా బయటి వ్యక్తులా అనేది దర్యాప్తులో తేలనుంది.
వెంటిలేటర్ వార్డులో రోగుల ఆక్సిజన్ తీసి వేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలను హాస్పిటల్ వర్గాలు ఖండించాయి. పోలీసుల దర్యాప్తులో నిజాలు తెలుస్తాయి అని సూపరింటెండెంట్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్.. పట్టుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు భేష్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్