జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాటారం మండలం ధన్వాడ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఆలయంలో నాటిన జమ్మి చెట్టును కాంగ్రెస్ నాయకులు తొలగించారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తక్షణమే తొలగించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళన చేస్తామన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.