జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి బుధవారం పర్యటించారు. ముందుగా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తిశ్వరా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం గ్రామంలో ఉన్న గిరిజన సహకర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేషన్ షాప్ ను తనిఖీ చేసారు. షాప్ లో ప్రజలకు అందజేస్తున్న బియ్యాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులు అందజేయాలని సూచించారు.