దామెర, ఏప్రిల్ 5 : మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని పరకాల ఏఎంసీ చైర్మన్ బొజ్జం రమేశ్ అన్నారు. సోమవారం దామెరలో మున్నూరు కాపు కులస్తుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారన్నారు. మున్నూరు కాపులకు గ్రామల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. త్వరలోనే సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులను కలువనున్నట్లు పేర్కొన్నారు. మున్నూరు కాపు గ్రామ, మండల కమిటీలను త్వరలోనే వేస్తామన్నారు. సమావేశంలో మాదారం పీఏసీఎస్ చ చైర్మన్ నల్లెల లింగమూర్తి, సర్పంచ్లు సాంబయ్య, రజిత, ఉపసర్పంచ్ మెంతుల రాజు, పీఏసీఎస్ డైరెక్టర్లు గుండా చంద్రమోహన్, పంచగిరి రాజు, తోట బాబూరావు, కొసనం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
ఆటోలో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్