పెద్దపల్లి, జనవరి 19 (నమస్తే తెలంగాణ)/కాజీపేట: రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోని 20 స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులను నిరంతరం గమ్యస్థానాలకు చేర్చిన కాజీపేట-నాగ్పూర్ ప్యాసింజర్ పునఃప్రారంభంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తున్నది. రైలు సేవలు ని లిచిపోయి రెండేళ్లయి నా మళ్లీ ప్రారంభాని కి మోక్షం కలుగకపోవడం, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీలు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఐదు దశాబ్దాలుగా సేవలు
కాజీపేట-నాగ్పూర్ ప్యాసింజర్ రైలు ఇప్పటిది కాదు. ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్కి చెందిన ఈ రైలు, 57135/36 నంబర్తో కాజీపేట నుంచి వయా పెద్దపల్లి – మంచిర్యాల – సిర్పూర్ కాగాజ్ నగర్-బల్లార్షా-సేవా గ్రామ్ మీదుగా అజ్నీ (నాగ్పూ ర్) దాకా వెళ్లేది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్, మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 444 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. ఈ ట్రైన్ ప్రాథమిక నిర్వహణ కాజీపేట జంక్షన్ నుంచి జరిగేది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని 20 స్టే షన్ల మీదుగా నడిచేది. తెలంగాణలో రైల్వేస్టేషన్లు హసన్పర్తి రోడ్డు, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొతపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి, పెద్దపల్లి జంక్షన్, రాఘవాపురం, రామగుండం, పెద్దంపేట్, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్డు, ఆసిఫాబాద్ రోడ్డు, సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ టౌన్ రైల్వే స్టేషన్లలో ఆగేది.
ప్రయాణికులకు తిప్పలే..
ఈ రైలు రద్దయి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పునరుద్ధరించలేదు. ఈ రైలును ప్రారంభించాలని ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులు కోరుతున్నారు. అయినప్పటికీ దక్షిణమధ్య రైల్వే అధికారులు మాత్రం రైలు పునఃప్రారంభంపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఉదయం కాజీపేట వైపు భాగ్య నగర్ సెమీ ఎక్స్ప్రెస్ రైలు తర్వాత మధ్యాహ్నం ఇంటర్సిటీ వరకు మధ్యలో ఎలాంటి రైలు లేదు. సుమారుగా 8గంటల వ్యవధిలో ఏ ఒక్క రైలు లేదు. అదే విధంగా సాయంత్రం కాజీపేట జంక్షన్లో పెద్దపల్లి వైపు సాయంత్రం 5:45 గంటలకు భాగ్యనగర్ సెమీ ఎక్స్ప్రెస్ రైలు తర్వాత ఉదయం 5:20 వరకు వచ్చే రామగిరి స్పెషల్ ట్రైన్ మధ్యలో ఏ ఒక రైలూ లేదు. ఇలా దాదాపు 12గంటల వ్యవధిలో ఒక్క రైలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పెద్దపల్లి వైపు కాజీపేట జంక్షన్లో రాత్రి 1:10 గంటలకు దక్షిణ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఉండగా, ఈ రైలుకి కరోనా కంటే ముందు జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలో స్టాప్ ఉండేది. ఈ రైలు పునః ప్రారంభం తర్వాత పలు స్టాప్లను తొలగించారు. ఈ స్టేషన్లలో ప్రస్తుతం ఈ దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కేవలం మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్లలో మాత్రమే ఆగుతున్నది.
పట్టని కేంద్రమంత్రి.. బీజేపీ ఎంపీలు
తెలంగాణలోని 20 రైల్వేస్టేషన్ల మీదుగా వేలాది మందిని తరలించే కాజీపేట-నాగ్పూర్ ప్యాసింజర్ను అర్ధంతరంగా నిలిపివేయడంతో ఈ రూట్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల కాలంగా ఈ రైలు సేవలు పూర్తిగా నిలిపివేసినా బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్రెడ్డిగానీ, బీజేపీ ఎంపీలు గానీ పట్టించుకోవడం లేదు. ఈ ప్యాసింజర్ సేవల కొనసాగింపుపై ఏ ఒక్కనాడూ కేంద్ర రైల్వే మంత్రినిగానీ రైల్వే శాఖ అధికారులను గానీ కలిసింది లేదు. ఇప్పటికైనా రైలు పునరుద్ధరణపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు రైలు సేవల్సి ఎక్కువగా ఉపయోగించుకొనే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రయాణికుల కోసం ఈ ప్రాంత ఎంపీలుగా ఉన్న బండి, అరవింద్, బాబూరావు కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎంతో మందికి వారధి..
తెలంగాణలోని 20స్టేషన్లలోని ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతగాతెలంగాణలోని 20 స్టేషన్లలోని ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేది. ఇది ఉదయం పూట విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కార్మికులకు(ముఖ్యంగా పాల వ్యాపారులకు, పూల వ్యాపారులకు) కాజీపేట వెళ్లేందుకు భాగ్యనగర్ సెమీ ఎక్స్ప్రెస్ రైలుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేది. పైగా ఈ రైలులో ఉదయం కాజీపేట జంక్షన్లో దిగితే అకడినుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు విజయవాడ వైపు నుంచి వచ్చే విశాఖ-ముంబై ఎక్స్ ప్రెస్ రైలు, గోలొండ ఎక్స్ప్రెస్ రైలుతో ప్రయాణికులను అనుసంధానం చేసేది. అలాగే తిరుగుపయనంలో కాజీపేట నుంచి నాగ్పూర్ వెళ్లేటప్పుడు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి పద్మావతి(12764), చార్మినార్(12760) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో కాజీపేట దాకా వచ్చి ఇకడి నుంచి పెద్దపల్లి వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ నాగపూర్ ప్యాసింజర్ రైలు ఎంతో ఉపయోగపడేది. ఈ రైలుకి ఇరువైపులా ప్రయాణికులతో మంచి ఆదరణ ఉండేది. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చేది. ఇలా ఎంతో మందికి సేవలందించిన ఈ ట్రెయిన్ను, ఆదా యం లేదనే సాకుతో దక్షిణమధ్య రైల్వే జోన్ అధికారులు 57135/36 కాజీపేట నుంచి నాగ్పూర్ ప్యాసింజర్ను మార్చి 2020లో నిలిపివేశారు.