వరంగల్, సెప్టెంబర్ 18(నమస్తేతెలంగాణ) : యాభై ఏడేళ్ల వయసు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పథకం ద్వారా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో పరిశీలనకు ఏర్పాట్లు చేపట్టింది. సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులను పరిశీలించి పింఛన్ మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. పెన్షన్ అర్హత వయసును ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈమేరకు అర్హులైన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 31వ తేదీ వరకు వయసు 57 ఏళ్లు నిండిన వారు పింఛన్ కోసం మీసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తులు పంపారు. ఎలాంటి ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈక్రమంలో హైదరాబాద్లోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయానికి చేరిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి జిల్లా వారీగా విభజించారు. వీటిని తాజాగా ఆయా జిల్లాల్లోని గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీవో) కార్యాలయానికి పంపారు. ఈ నివేదిక ప్రకారం జిల్లాలో పదమూడు మండలాల నుంచి కొత్తగా ఆసరా పెన్షన్ కోసం 16,237 మంది దరఖాస్తు చేశారు. అత్యధికంగా రాయపర్తి మండలం నుంచి 1,804 దరఖాస్తులు వచ్చాయి. 1,732 దరఖాస్తులతో నర్సంపేట మండలం రెండో స్థానంలో ఉంది. పర్వతగిరి మండలం నుంచి 1,369 దరఖాస్తులు రాగా అతి తక్కువగా నల్లబెల్లి మండలం నుంచి 886 ఉన్నాయి. ఖానాపురం మండలం నుంచి 916 మంది ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేశారు.
పింఛన్కు అర్హులెవరంటే..
ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం వృద్ధాప్య పింఛ న్ లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.2,016 ఇస్తున్నది. జిల్లాలోని పదమూడు మండలాల్లో ప్రస్తుతం 63,609 మంది లబ్ధిదారులు పింఛన్ పొందుతున్నా రు. ప్రతి నెలా మొత్తం రూ.14,68,94,304 అందజేస్తున్నది. ప్రస్తుతం ఈ పెన్షన్ అర్హత వయసును 57 ఏళ్లకు కుదించి, తెల్లరేషన్కార్డు ఉండి సంవత్సర ఆ దాయం జీపీల పరిధిలో రూ.1.50లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో రూ.2లక్షల్లోపు ఉన్న వారు వృద్ధాప్య పింఛన్ పొందడానికి అర్హులుగా ప్రకటించింది. కు టుంబంలో ఒకరే అర్హులని కూడా స్పష్టం చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేయాలని పేర్కొన్నది. ఓటరు గుర్తింపు కార్డు లేదా స్టడీ సర్టిఫికెట్లలోని వయసును పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపింది.
క్షేత్రస్థాయి పరిశీలనకు..
వృద్ధాప్య పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తమకు అం దిన దరఖాస్తులను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారు లు మండలం వారీగా విభజించారు. వీటిని ఎంపీడీవోలు, ము న్సిపల్ కమిషనర్లకు పంపేందుకు కసర త్తు చేస్తున్నారు. ఎంపీడీవోలకు అందిన దరఖాస్తుల ను గ్రామాల్లో కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లకు అందిన దరఖాస్తులను బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. గ్రా మాల్లో ఎంపీడీవో లు, నర్సంపేట, వ ర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు, వరంగల్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగనుంది. అనంతరం దరఖాస్తులను ఎంపీడీవో లు, కమిషనర్లు ప్ర భుత్వానికి నివేదిక పంపిస్తారు. ఈ మేరకు అర్హులైన వారందరికీ త్వర లో నెలనెలా ఆస రా పథకం నుంచి వృద్ధాప్య పింఛన్ అందనుంది.