ఎంపీడీవో చంద్రశేఖర్
వాజేడు, జూలై 22 : వర్షాల నేపథ్యంలో గో దావరి వరదలపై గ్రామాల కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఎంపీడీవో కే చంద్రశేఖర్ అన్నారు. మండ ల పరిషత్ కార్యాలయంలో గురువారం కార్యదర్శులతో ఎంపీడీవో ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసి మాట్లాడారు. వరద ముంపునకు గు రయ్యే పది గ్రామాలకు ముందస్తుగా రోప్, ట్యూబ్లు, తదితర సామగ్రి అందజేసినట్లు చె ప్పారు. వరద సహాయక చర్యలతోపాటు గజ ఈతగాళ్ల సాయం తీసుకుని ప్రజలకు రక్షణ చర్య లు చేపట్టాలన్నారు. ముంపునకు గురయ్యే ఇం డ్లలో నివాసముండే వారని గుర్తించి పునరవాస కేంద్రాలకు తరలించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. సమావేశంలో కార్యదర్శులు నిమ్మటూరి వెంకటేశ్వర్రావు, చిడెం నరేశ్బా బు, చిచ్చడి అశోక్, శిరీష, సరిత, సురేశ్, ప్రవీణ్కుమార్, రవీందర్, ప్రభాకర్, వినోద పాల్గొన్నారు. అలాగే సాయంత్రం మండల ప్రత్యేక అధికారి విజయభాస్కర్రెడ్డి ఆ ధ్వర్యంలో ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ అల్లం రాజ్కుమార్ గోదావరి వరద ప్రభావిత ప్రదేశాలను సందర్శించారు. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి వరదను పరిశీలించి, చీకుపల్లి గ్రామశివారు ఇసుక వాగు బ్రిడ్జి వద్ద గోదావరి వరద ముంపునకు గురయ్యే 163 జాతీయ ర హదారిని పరిశీలించారు. వారివెంట ఆర్ఐ హరి మురళీకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.