చెన్నారావుపేట, ఏప్రిల్ 15: ఎమ్మార్సీ కేంద్రంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను గురువారం మండల టీం సభ్యులైన తహసీల్దార్ పూల్సింగ్చౌహన్, ఎంఈవో రత్నమాల, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పోలెపల్లి రవి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలతో ఎలాంటి లబ్ధి పొందకుండా ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే సిబ్బందికి మాత్రమే ప్రభుత్వం తరఫున ఇచ్చే రూ. 2 వేలు, 25 కేజీల బియ్యం పథకం వర్తిస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే వివరాల ప్రకారమే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చిన స్కూళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని టీం సభ్యులు హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల హెచ్ఎంలు రమేశ్, మహేశ్, నర్సింహారెడ్డి, జోసెఫ్, పద్మ, రాయన్న, రవీందర్, జగదీశ్, శ్రీధర్, ఎమ్మార్సీ సిబ్బంది అశోక్, స్వప్న, శ్రీనివాస్, రాజేశ్, సీఆర్పీలు ఎం సంపత్, బాలు, స్వామి పాల్గొన్నారు.
రికార్డుల పరిశీలన
నెక్కొండ: ప్రైవేట్ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించనున్న నేపథ్యంలో అర్హులను గుర్తించేందుకు రికార్డులను పరిశీలిస్తున్నారు. మండలకేంద్రంలోని మండల విద్యావనరుల కేంద్రంలో తహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఎంఈవో రత్నమాల, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రంగారావుతో కూడిన బృందం ప్రైవేట్ టీచర్ల అక్విడెన్స్, అటెండెన్స్ రికార్డులను పరిశీలించారు. ప్రైవేట్ పాఠశాలల హెచ్ఎంలు సమర్పించిన జాబితాపై సమీక్షించారు. కుటుంబంలో ఎవరైనా ఆసరా పింఛన్ పొందుతున్నా, భార్యాభర్తలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా అనర్హులని వారు తెలిపారు.
నర్సంపేట రూరల్: పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎంఈవో విజయ్కుమార్, ఇటుకాలపల్లి, లక్నేపల్లి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు కొర్ర సారయ్య, వీ మురళి పరిశీలించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు.
శాయంపేట: మండలంలోని ఏడు ప్రైవేట్ పాఠశాలల్లో రికార్డులను కాంప్లెక్స్ హెచ్ఎం అనురాధ, ఎంఈవో సిబ్బంది లింగమూర్తి పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన హాజరు, అక్విటెన్స్ రిజిస్టర్లు, యూడైస్ ఫారాలను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని వారు చెప్పారు.
టీచర్ల హాజరు పట్టిక పరిశీలన
గీసుగొండ: ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించినట్లు ఎంఈవో సత్యనారాయణ తెలిపారు. గత మార్చిలో పని చేసిన ఉపాధ్యాయుల రిజిస్టర్తోపాటు బోధనేతర సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆధార్కార్డులు, బ్యాంకు పాస్పుస్తకాలు అందించాలని ఆయన సూచిం
తప్పుడు సమాచారం ఇచ్చే స్కూళ్లపై చర్యలు
ఇవి కూడా చదవండి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
పాలమూరు పట్టణానికి స్వచ్ఛమైన నీటిని అందిస్తాం