హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. మే 17వ తేదీ నుండి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఎస్ఎస్సీ బోర్డు విద్యార్థుల ఫలితాలను ప్రకటించనుంది. ఆబ్జెక్టివ్ క్రైటీరియా పద్దతిలో ఫలితాల ప్రకటన. బోర్డు వెల్లడించిన ఫలితాలతో సంతృప్తి చెందని ఎవరైనా విద్యార్థులు పరిస్థితుల అనుకూల అనంతరం వ్యక్తిగతంగా పరీక్షలు రాయొచ్చని విద్యాశాఖ వెల్లడించింది. సీబీఎస్ఈ సైతం పదో తరగతి పరీక్షలను రద్దు చేసి పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.