బయ్యారం, డిసెంబర్ 4: మాజీ సీఎం రోశయ్య మృతి ఆర్యవైశ్య సమాజానికి తీరని లోటని ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి దారం శ్రీనివాస్, కోశాధికారి నూనే పూర్ణచందర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గాంధీ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వేమిశెట్టి కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, కేశవరావు, మాధ వ్, ఖాదర్బాబు, దామోదర్ పాల్గొన్నారు.
తొర్రూరు: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చిత్రపటానికి ఆర్యవైశ్య మహాసభ జిల్లాశాఖ అధ్యక్షుడు పొద్దుటూరి గౌరీశంకర్ నేతృత్వంలో పూలమాల వేసి నివాళులర్పించారు. తొర్రూరు మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రోశయ్య చిత్రపటంతో ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి, గాంధీసెంటర్లో నివాళులర్పించారు. రోశయ్య ఆర్యవైశ్య కులస్తులు, నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల, పట్టణ సంఘాల అధ్యక్షుడు మచ్చ సోమయ్య, బిజ్జాల అనిల్, జిల్లా బాధ్యులు ప్రతాపని వెంకటేశ్వర్లు, సామ రామ్మూర్తి, రేవూరి నర్స య్య, బిజ్జాల వెంకటరమణ, వజినపల్లి అనిల్కుమార్, చీదర మహేశ్, మచ్చ సురేశ్, చిదిరాల రవి, ఇమ్మడి రాంబాబు, గోపారపు నాగేశ్వరరావు, తోట శ్రీనివాస్, తేరాల సోమన్న పాల్గొన్నారు. అనంతరం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు బిజ్జాల శ్రీనివాస్, సంఘ ప్రతినిధులు గోపారపు నిరంజన్, తాటికొండ సదాశివరావు, వల్లపు వెంకటేశ్వర్లు, కేశెట్టి శ్రీనివాస్, మాదరపు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
నర్సింహులపేట: మండల కేంద్రంలో రోశయ్య చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం, వివిధ పార్టీల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. జీనుకల రమేశ్, రామకృష్ణ, యాకయ్య, యాదగిరి, సోమేశ్వరరావు, యాకన్న, అనిల్, మల్లయ్య, నరేశ్, గణేశ్ ఉన్నారు.