హన్మకొండ, ఆగస్టు 4: అసెంబ్లీ సీట్లు పెంచకుంటే పోరాటం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం హన్మ కొండలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నియోజకవర్గాల పున ర్విభజనపై కేంద్రం మొండివైఖరి ప్రదర్శిస్తోందని, అసెం బ్లీ సీట్ల పెంపుపై దాటవేత ధోరణి అవలంబిస్తోందని అ న్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ర్టా ల్లో అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచడం లేదని అన్నారు. కశ్మీర్, గుజరాత్, బీహార్పై ప్రేమ చూపుతూ అన్ని విష యాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. 2026 జనాభా లెక్కల గెజిట్ వచ్చాక సీట్లు పెంచుతామని అనడం ఏకపక్షమని, జమ్మూ కశ్మీర్కు లేని అడ్డు తెలుగు రాష్ట్రాలకు ఎందుకని ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో 175 సీట్లను 225కు, తెలంగాణలోని 119 సీట్లను 153 కు పెంచాల్సి ఉందన్నారు. చట్ట సవరణ చేసి ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను ఏపీలో చేర్చలేదా.. రెండు రాష్ర్టాల్లో ఎమ్మెల్సీ సీట్లు పెంచలేదా అని ప్రశ్నించారు. రెండు రాష్ర్టాల ప్రయోజనాలపై బీజేపీకి చిత్తశుద్ధి లేద న్నారు. సీట్లు పెరిగితే రాజకీయంగా ఇక్కడి పార్టీలు బలో పేతం అవుతాయనే అక్కసుతోనే అడ్డుకుంటోందన్నారు. ఇక్కడి బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రా న్ని నిలదీయాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడమే కాకుండా అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ ఎంపీలు, నాయకులు కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు.
కౌవ్ బెల్ పార్టీ బీజేపీ
కేంద్రంలో ఉన్న బీజేపీ కౌవ్ బెల్ పార్టీ అని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమా ర్ అన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు అనేది తెలుగు రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని అన్నారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం దాటవేసిందన్నారు. దక్షిణభార త దేశ ప్రజలపై బీజేపీ వివక్ష చూపుతోందని ఆయన మండిపడ్డారు. ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే ట్యాక్స్… ఒకేసారి ఎన్నికలు జరుగాలనే మోదీ, జమ్మూకశ్మీర్కు ఒక న్యాయం, తెలుగు ప్రజలకు ఒక న్యాయమా అని ప్ర శ్నించారు. ఎన్నికల ఉద్దేశంతోనే కశ్మీర్లో సీట్లు పెంచు తున్నారన్నారు. తెలంగాణలో ఎలాగూ గెలువరని సీట్లు పెంచడం లేదన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ‘సబ్జెక్టు’ అనే పదాన్ని తొలగించి ‘నాట్ విత్ స్టాండింగ్’ అనే పదా న్ని చేర్చి విభజన చట్టాన్ని సవరించి వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని వినోద్కుమార్ డిమాండ్ చేశారు. సమా వేశంలో నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్య, మేడిపల్లి శోభన్ తదితరులు పాల్గొన్నారు.