జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలో శివ మార్కండేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమనికి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ హాజరై హాజరై పూజలు నిర్వహించారు. మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రకసాదాలు అందజేశారు.
కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీపీ నక్క శంకర్, జడ్పీటీసీ గోస్కుల జలంధర్, ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, టీఆర్ఎస్మండల అధ్యక్షుడు బొల్లం రమేష్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం , ఏఎంసీ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ మరాంపెళ్లి బాబు, బొంకూర్ సర్పంచ్ సత్తన్న, నాయకులు మాజీ సర్పంచ్ కమలాకర్ రావు, నారాయణ రెడ్డి, లక్ష్మణ్ రావు, అశోక్, యూత్ అధ్యక్షుడు తిరుపతి, రంజిత్ రావ్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.