జగిత్యాల : విద్యా వ్యవస్థ పటిష్ఠతకు ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఆధీనంలో పనిచేస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించేందుకు జిల్లా పరిషత్ ద్వారా ఆమోదించబడిన అండర్ టేకింగ్ సర్టిఫికెట్స్ సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులకు వసంత అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. కొత్త జిల్లాలలో ప్రజలకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచడం పట్ల సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.