ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
గుల్లపేటలో చెక్డ్యాం నిర్మాణ పనుల పరిశీలన
పలువురికి పరామర్శలు
జగిత్యాల రూరల్, జూలై 18: ప్రతి నీటి బొటును ఒడిసి పట్టడానికే చెక్డ్యాంలను నిర్మిస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపా రు. జగిత్యాల మండలంలోని గుల్లపేటలో రూ. కోటీ 70లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చెక్డ్యాం నిర్మాణ చివరి దశ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నదని ఉద్ఘాటించారు. రైతుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తు న్న రాష్ట్రం దేశంలో తెలంగాణేనని చెప్పారు. చెక్డ్యాంల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని, బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుందని, బోర్లు వేసే పరిస్థితి తప్పుతుందని అన్నారు. వందలాది ఎకరాలు సాగులోకి వస్తాయని, రైతులకు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల ముకుందం, సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ సురేందర్రెడ్డి, ఆర్బీఎస్ గ్రామశాఖ అధ్య క్షుడు రాజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నరేశ్, నాయకులు శ్రీపాల్, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
జగిత్యాల మండలంలోని తక్కళ్లపెల్లి, గుల్లపేట ఎంపీటీసీ దమ్మ సురేందర్రెడ్డి తాత దమ్మ రాజారాం శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. సురేందర్రెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతారం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గంగారెడ్డి తండ్రి దమ్మ రాజయ్య అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. గుట్రాజ్పల్లికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేశం తల్లి వాసాల లక్ష్మి, గ్రామానికి చెం దిన బినవేని భూమయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబాలను, అనంతారం గ్రామ మాజీ సర్పంచ్ ఏదుల రాజయ్య మరణించగా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
36మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
జగిత్యాల రూరల్, జూలై 18: జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్లో నేత్ర సమస్యతో బాధపడుతున్న నియోజకవర్గానికి చెంది న 36మంది నిరుపేదలకు ఆపి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్యనిపుణులు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న తమకు ఎమ్మెల్యే ఉచితంగా ఆపరేషన్లు చేయడంపై సంజయ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంబాల రాంకుమార్, సమిండ్ల శ్రీనివాస్, దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.