హుజురాబాద్టౌన్, ఆగస్టు 4: దళిత బహుజనులు బీజేపీకి ఓటేస్తే చేటేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ వ్యాఖ్యానించారు. దళిత వ్యతిరేక, మతతత్వ పార్టీకి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్లోని కేరళ స్కూల్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మతం పేరిట ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టిస్తూ బహుజనులను విద్యకు, అభివృద్ధికి దూరం చేసిన బీజేపీకి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు. దళిత బహుజన విద్యార్థులకు ఫెలోషిప్లు రాకుండా అడ్డుపడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశారని ఆరోపించారు. కానీ, ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు దళితబంధును తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్కపల్లి కుమార్, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కోడెపాక సారంగం, కమలాపుర్ మండలాధ్యక్షుడు పీ రాజు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రసాద్, మల్లన్న, వీణవంక మండల నాయకుడు గాలిపెల్లి వెంకన్న, ఎంఎస్ఎఫ్ నాయకులు శనిగరపు మధు, కల్లెపెల్లి రాజు, పుల్ల రవితేజ, చొప్పదండి నియోజకవర్గ నాయకుడు దీకొండ రమేశ్ పాల్గొన్నారు.