దేశ వ్యాప్తంగా ప్రధానిని విమర్శిస్తే ఎక్కడినుంచి ఏ దాడులు జరుగుతాయోననే భయం అలుముకొని ఉన్నది. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఔత్సాహికులు ప్రధానిపై వ్యతిరేకంగా స్పందించడానికి జంకుతున్న సందర్భం ఇది. ఇలాంటి భీతావహ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు! ఇది దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధానిని విమర్శించి.. ‘ఆదాయపు పన్ను శాఖ’, ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్’ వంటి కేంద్ర సంస్థల దాడులను ఎదుర్కోవడం కంటే మౌనంగా ఉండటమే మేలని దేశంలోని రాజకీయనేతలు ఆలోచిస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ సాహసం ప్రకంపనలు సృష్టిస్తున్నది.
మోదీ ప్రభుత్వతీరును చీల్చిచెండాడుతూ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. ఇటీవలి కేసీఆర్ విలేకరుల సమావేశం సోషల్ మీడియా వేదికల్లో దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నది. ప్రెస్మీట్ ద్వారా సీఎం ఇచ్చిన సందేశం చేరుకోవాల్సిన వారికి చేరుకొని లక్ష్యాన్ని సాధించింది. సందర్భోచితంగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసంగిస్తూ కొన్నిసార్లు స్వచ్ఛమైన ఉర్దూ భాష పదాలను కేసీఆర్ ప్రయోగించారు. సమయమొస్తే తాను నోర్మూసుకొని ఉండే రకాన్ని కాదని స్పష్టం చేశారు.
వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ అందరు రాజకీయనేతల్లా కాకుండా, భావోద్వేగాలకు అతీతంగా రాజకీయాలు చేసే నాయకుడు. ఎన్నికల రాజకీయాలను ఆయన ఎన్నడూ తేలిగ్గా తీసుకోరు. అతని రాజకీయ దాడి శైలి ‘గెరిల్లా యుద్ధం’ మాదిరి ఉంటుంది. అనూహ్యమైన భాషతో విమర్శనాస్ర్తాలను సంధిస్తూ అన్నిదిశలనుంచి దాడి చేస్తారు. ఊహించని ప్రశ్నలను సంధిస్తారు. ఇదంతా కూడా తన ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసేందుకే. ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా కేసీఆర్ అవలంబించారు. ‘మిలియన్ మార్చ్’, ‘సకలజనుల సమ్మె’, ‘సింగరేణి సమ్మెల’తో పాటు ‘బతుకమ్మ’, ‘తెలంగాణ సంబురాలు’ తదితర తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలను కూడా ఉద్యమరూపాలుగా మలిచారు. ఇటువంటి కార్యక్రమాలతో తెలంగాణ వ్యతిరేకశక్తులు కేసీఆర్ ధాటికి తట్టుకోలేక గాలికి కొట్టుకపోయారు.
కేసీఆర్ అనుసరిస్తున్న ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మీడియాను కూడా ఉద్యమ సమయంలో విపరీతంగా ఆకర్షించాయి. అది కేసీఆర్కు అనుకూలంగా జాతీయ రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసింది. చివరికి కేంద్రం తలొగ్గి తెలంగాణను ఇచ్చేందుకు దోహదం చేసింది. ఎనిమిదేండ్ల తర్వాత తిరిగి ప్రెస్మీట్ ద్వారా తన అస్త్రశస్ర్తాలను కేసీఆర్ బయటికి తీస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా బరిలోకి దిగారనేది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిదర్శనంగా నిలిచింది. దేశ ప్రజలతో పాటు మీడియా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నది. ఈ దేశీయ సామాజిక పరిస్థితిని కేసీఆర్ పసిగట్టారు. ఈ పరిస్థితుల్లోనే తాను జాతీయ
రాజకీయాల్లో గౌరవప్రదమైన ప్రముఖస్థానాన్ని సంపాదించుకోగలుగుతానని భావిస్తున్నారు. అందుకోసం ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇది జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ వేస్తున్న అడుగులుగా భావించవచ్చు.
ఎం.కె.స్టాలిన్, పినరాయి విజయన్ వంటి దక్షిణ భారత రాజకీయ నాయకుల కంటే కేసీఆర్ను ముందుంచడంలో హిందీ, ఉర్దూపై ఆయనకు ఉన్న పట్టు కీలకం. ఇంగ్లీషు భాషలో కేసీఆర్కు ఉన్న పట్టు, వాగ్ధాటి క్లిష్ట సమస్యలను కూడా సమర్థంగా, అత్యంత అర్థవంతంగా చెప్పగల సామర్థ్యాన్ని ఆయనకు కల్పించింది. ఈ సామర్థ్యమే.. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి భావోద్వేగానికి గురవుతూ ప్రసంగించే నాయకుల కంటే కేసీఆర్ను ముందంజలో ఉంచుతున్నది.
రాజకీయ పరిణతితో కూడిన కేసీఆర్ పాలనా ఎత్తుగడలు, సందర్భానుసారంగా పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులను అనుసరిస్తూ సాగే రాజకీయ చతురత, అతన్ని జాతీయ రాజకీయ ప్రస్థానంలో ముందంజలో ఉంచటానికి ఉపయోగపడుతున్న ముఖ్యమైన అంశాలు. గల్లీ నుంచి ఢిల్లీకి దృష్టిసారించడం కేసీఆర్ వ్యూహంలోని మరో ముఖ్యమైన అంశం. ‘ఎయిర్ ఇండియా’, ‘ఎల్ఐసీ’ వంటి ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయాన్ని జాతీయ సమస్యగా చేయడం ద్వారా దేశ ప్రజలదృష్టి ఆకర్షించారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను తేటతెల్లం చేశారు. కేసీఆర్ ఉపయోగించే ఇలాంటి ప్రధాన సామాజిక, ఆర్థిక, రాజకీయ అస్త్రశస్ర్తాలను తట్టుకోలేక
బీజేపీ ఆత్మరక్షణలో పడిపోవడం ఖాయం.
జాతీయ ఆకలి సూచీ, జీడీపీ, ద్రవ్యోల్బణం తదితర జాతీయ సామాజిక, ఆర్థిక అంశాలు చర్చనీయాంశాలైతే బీజేపీని ఎవరు సమర్థిస్తారు? ఇదే విషయాన్ని బాగా అర్థం చేసుకున్న కేసీఆర్ జాతీయ సమస్యలను ఎజెండా మీదికి తెచ్చి తద్వారా దేశ ప్రజలను చైతన్యపరిచి సమీకరించేందుకు సంసిద్ధులవుతున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అభివృద్ధిని తన అమ్ములపొదిలో ఉంచుకొని, బీజేపీని ఆత్మరక్షణలో పడేసి, కాంగ్రెస్ను అసలు ఆటలో లేకుండా చేయడమే కేసీఆర్ అద్భుతమైన రాజకీయ
వ్యూహం.
తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్ చుట్టూ అందమైన అభివృద్ధి వలయాలు ఔటర్ రింగ్రోడ్, రీజినల్ రింగ్రోడ్ లాంటి వాటిని సృష్టించారు. మున్సిపల్ శాఖామంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీ రామారావు వినూత్నరీతిలో చేపడుతున్న ‘ఫ్లై ఓవర్’ నిర్మాణాలు, వేలాడే వంతెనలు, భూగర్భమార్గాలు వంటి వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ ప్రజలనే కాదు అందరి మెప్పునూ పొందుతున్నాయి. నిత్యం హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేటీఆర్కు ఈ సందర్భంగా అభినందనలు తెలుపాలి.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అనుసరిస్తూ సాగుతున్న కేసీఆర్ రాజకీయ వ్యూహం బీజేపీని తిరిగి హిందూత్వ సెంటిమెంట్ మీద ఆధారపడి రాజకీయాలు చేయాల్సిన అనివార్య పరిస్థితులవైపు నెట్టడం ఖాయం. తద్వారా మత రాజకీయాల విషయంలో బీజేపీపై ఇప్పటికే ఉన్న ఆరోపణలకు మరింత సమర్థన వస్తుందనటంలో సందేహం లేదు. అభివృద్ధి కేంద్రంగా చర్చ సాగినప్పుడు కేసీఆర్కు హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలు చూపించగలరు. కానీ అదే బీజేపీకి సాధించిన విజయాలను చెప్పుకోవటానికి, నిరూపించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. జాతీయ సమస్యలపై చర్చ మళ్లినప్పుడు
కూడా టీఆర్ఎస్ ‘సేఫ్ జోన్’లో ఉంటుంది. ఇదే కేసీఆర్ సాధించదలుచుకున్న ముఖ్య విషయం.
కేసీఆర్ అమ్ములపొదిలో ఇంకా అనేక అస్ర్తాలున్నట్టు సమాచారం. చైనా చొరబాటు నుంచి మొదలుకుంటే, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దాకా, క్రిప్టో కరెన్సీ నుంచి మొదలు నదుల అనుసంధానం దాకా బీజేపీపై ప్రయోగించడానికి కేసీఆర్ వద్ద వాడియైన అస్ర్తాలు సిద్ధంగా ఉన్నాయి.
అభివృద్ధి కేంద్రంగా చర్చ సాగినప్పుడు కేసీఆర్కు హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలు చూపించగలరు. కానీ అదే బీజేపీకి సాధించిన విజయాలను చెప్పుకోవటానికి, నిరూపించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. జాతీయ సమస్యలపై చర్చ మళ్లినప్పుడు కూడా టీఆర్ఎస్ ‘సేఫ్ జోన్’లో ఉంటుంది. ఇదే కేసీఆర్ సాధించదలుచుకున్న ముఖ్య విషయం.
రాష్ర్టానికి వస్తే.. కాంగ్రెస్ను కనీసంగా పరిగణనలోకి తీసుకోకూడదనేదే కేసీఆర్ వ్యూహం. బీజేపీ వ్యతిరేక పోరాటంలో తానే బలమైన పోరాట యోధుడిగా నిరూపించుకోవడం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ టీఆర్ఎస్ వైపు మళ్లనున్నాయి. ఈ ఎత్తుగడ కాంగ్రెస్ను, వామపక్షాలను మరింతగా బలహీనపరుస్తుందనటంలో సందేహం లేదు. ఈ మార్గంలోనే కేసీఆర్ వ్యూహం విజయవంతం అవుతుంది.
– కృష్ణప్రసాద్ (‘ది పయనీర్’ సౌజన్యంతో..)