బెంగళూరు: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు భారత హాకీ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. అనుభవజ్ఞ్ఞులు, యువకుల మేళవింపుతో మొత్తం 16 మందితో జట్టును ప్రకటించారు. గత కొన్నేండ్లుగా నిలకడగా రాణిస్తున్న పది మంది కొత్త వాళ్లకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఒలింపిక్స్లో అరంగేట్రం చేసే అవకాశమిచ్చింది. ఇందులో అమిత్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్, నీలకంఠ, సుమిత్, శంషేర్సింగ్, దిల్ప్రీత్సింగ్, గుర్జాంత్సింగ్, లలిత్కుమార్తో పాటు సీనియర్ డిఫెండర్ బిరేంద్ర లక్రా తొలిసారి విశ్వక్రీడల్లో ఆడబోతున్నారు. సీనియర్ల విషయానికొస్తే కెప్టెన్ మన్ప్రీత్సింగ్, హర్మన్ప్రీత్సింగ్, రూపిందర్పాల్సింగ్, సురేందర్ కుమార్, మణ్దీప్సింగ్, గోల్కీపర్ శ్రీజేష్ ఉన్నారు.