న్యూయార్క్: అమెరికాలో ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. మిషిగన్ రాష్ర్టానికి చెందిన మరిసా ఫోటియో అనే ఉపాధ్యాయురాలు ఈ నెల 19వ తేదీన చికాగో నుంచి విమానంలో ఐస్లాండ్కు పయనమయ్యారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆమె గొంతులో మంటగా అనిపించటంతో ఆమె బాత్రూంలో కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేసుకొన్నా రు. అందులో పాజిటివ్ అని తేలటంతో వెంటనే విమాన సిబ్బందికి తెలిపారు. ప్రత్యేకంగా సీటు కేటాయించే అవకాశంలేదని సిబ్బంది తెలుపటంతో ఇతర ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫోటియో తనకుతాను బాత్రూంలోనే 5 గంటలు ఐసొలేషన్లో ఉండిపోయారు. ప్రయాణానికి ముందే 20 సార్లు పీసీఆర్, 5 సార్లు ర్యాపిడ్ టెస్టులు చేసుకోవటంతోపాటు బూస్టర్ డోస్ కూడా తీసుకోవటం గమనార్హం.