అమెరికాకు చెందిన ఓ మహిళ మద్యం మత్తులో తూలుతూ కారును నడిపింది. ఆ కారు ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లపైకి దూసుకెళ్లింది. అయితే జీపీఎస్( Global Positioning System ) ఆధారంగా తాను డ్రైవ్ చేశానని సదరు మహిళ పోలీసులకు చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. 26 ఏండ్ల మహిళ కారు నడుపుకుంటూ.. పోలీసు డిపార్ట్మెంట్ గ్యారేజ్లోకి వచ్చింది. అంతే కాకుండా పెడెస్ట్రియన్ ప్లాజాను దాటి పోలీసు స్టేషన్ మెట్లను ఎక్కించింది. ఈ క్రమంలో మెట్లపై కారు ఆగిపోయింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జీపీఎస్ను ఆధారం చేసుకుని కారు నడిపానని, అది చూపించిన మార్గంలోనే వెళ్తున్నానని సదరు మహిళ పోలీసులకు చెప్పింది. అయితే ఆమెకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించగా, మద్యం సేవించినట్లు తేలింది. దీంతో ఆమెకు పోలీసులు సమన్లు జారీ చేశారు. అదృష్టవశాత్తు ఆ మహిళ పోలీసులపై దాడి చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు కోరారు.