ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ను జీ20 సమావేశాలకు అనుమతించకూడదని యూకే ప్రధాన మంత్రి రేసులో ఉన్న రిషి సునాక్ డిమాండ్ చేశాడు. ఉక్రెయిన్పై పుతిన్ అక్రమంగా చేస్తున్న యుద్ధాన్ని ఆపే వరకు అతనిపై ఈ నిషేధం కొనసాగించాలని ఆయన కోరారు.
పసివాళ్లు నిద్రలో మంచం మీదనే చనిపోవడానికి కారకుడైన అలాంటి వ్యక్తితో కలిసి టేబుల్పై కూర్చోవడం మంచిది కాదని సునాక్ అభిప్రాయపడ్డారు. బాలి వేదికగా ఈ ఏడాది నవంబరులో జీ20 సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో పుతిన్తోపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా పాల్గొంటారని ఇండోనేషియా ప్రెసిడెంట్ విడోడో ప్రకటించారు. ఇటీవల ఒక ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.