హైదరాబాద్ : తనపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. మీడియా సమావేశం ద్వారా తనపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాలోని మాసాయిపేటలో వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేయడమే కాకుండా, ప్రశ్నించిన రైతులను బెదిరింపులకు గురిచేసినట్లు మంత్రి ఈటలపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన సీఎం కేసీఆర్ ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని సీఎస్ సోమేష్ కుమార్, విజిలెన్స్ డీజీని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఈటల భూకబ్జా.. సీఎం కేసీఆర్కు బాధితుల లేఖ