వాషింగ్టన్, డిసెంబర్ 1: ప్రపంచవ్యాప్తంగా అత్యంత మొండి రోగాల్లో ఒకటిగా పేరుపడ్డ మలేరియాకు అమెరికా పరిశోధకులు సరికొత్త టీకాను అభివృద్ధి చేశారు. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఎంఆర్ఎన్ఏ ఆధారిత రెండు వ్యాక్సిన్లు అభివృద్ధి చేసినట్టు ప్రకటించారు.
ఇవి మలేరియా సోకడాన్ని, ఇతరులకు వ్యాపించటాన్ని విజయవంతంగా అడ్డుకొన్నట్టు తెలిపారు. ఈ వ్యాక్సిన్లు ప్రస్తుతం జంతువుల మీద ప్రయోగించగా, త్వరలోనే మనుషులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.