న్యూయార్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుంచి ఎదురయ్యే ముప్పు, టెక్నాలజీ దుర్వినియోగంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) టాప్ టెక్నాలజీ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ విశేష ప్రాచుర్యం పొందడంతో వ్యక్తులు, సమాజం, జాతీయ భద్రతకు ఏఐ నుంచి పొంచి ఉన్న ముప్పులను నివారించే క్రమంలో టెక్ సీఈఓలతో బైడెన్ విస్తృతంగా సంప్రదింపులు జరిపారు.
ఏఐ వ్యవస్ధలపై కంపెనీలు విధాన నిర్ణేతలతో పారదర్శకంగా వ్యవహరిస్తూ టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా ఆయా ఉత్పత్తులు ప్రజల్లోకి వచ్చే ముందే అన్ని రకాల జాగ్తత్తలు చేపట్టాలనే అంశంతో పాటు ఏఐపై ఈ సమావేశంలో నిర్మాణాత్మక చర్చ జరిగిందని వైట్హౌస్ పేర్కొంది. ఏఐ టూల్స్పై హానికారక అటాక్స్ జరగకుండా, వీటిలో లోపాలను నివారించేలా చర్యలు చేపట్టాలని టెక్ సీఈవోలను బైడెన్ కోరినట్టు సమాచారం.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా పాల్గొన్న ఈ భేటీలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, చాట్జీపీటీ క్రియేటర్ ఓపెన్ఏఐ అధిపతి శామ్ అల్ట్మన్ సహా పలువురు టెక్ దిగ్గజాలు, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More
Ludicrous | హాస్యాస్పదం.. క్రెమ్లిన్పై దాడి వెనుక అమెరికా హస్తం ఉందన్న ఆరోపణలను ఖండించిన వైట్హౌస్